Wednesday, May 1, 2024

TDP-Janasena : నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం

తెలుగుదేశం-జనసేన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, పార్టీ నేత పట్టాభి సభ్యులుగా ఉండగా.. జనసేన నుంచి వరప్రసాద్‌, ముత్తా శశిధర్‌, శరత్‌ కుమార్‌.. సభ్యులుగా ఉన్నారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఏర్పాటు చేసిన ఆ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది.. ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీఆర్‌ భవన్‌ వేదికగా ఈ సమావేశం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement