Thursday, May 2, 2024

ఎస్వీ మెడిక‌ల్ క‌ళాశాల‌లో సీనియ‌ర్ల‌పై జూనియ‌ర్ దాడి … ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

తిరుపతి: ఎస్వీ వైద్య కళాశాల యూజీ హాస్టల్లో నిద్రిస్తున్న సీనియర్ విద్యార్థులపై జూనియర్ విద్యార్థి స‌ర్జిక‌ల్ బ్లేడ్ తోనూ, క్రికెట్ స్టిక్ తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మెడికోలు పలమనేరు వాసి ప్రవీణ్, నందలూరు వాసి మహేష్‌గా గుర్తించారు. దాడికి పాల్పడిన మూడవ సంవత్సరం మెడికో విద్యార్థి గణేష్‌గా గుర్తించారు.

దాడి తర్వాత గణేష్ పారిపోయాడు. ప్రవీణ్ తలకు, మహేష్‌కు తలకి, గొంతుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మహేష్‌కు వైద్యులు సర్జరీ చేస్తున్నారు. ఇరువురికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని రుయా సిబ్బంది చెబుతున్నారు. దాడి ఎందుకు జరిగిందో స్పష్టంగా చెప్పలేని స్థితిలో మెడికోలు ఉన్నారు. జరిగిన ఘటనపై వెస్ట్ సీఐ జయనాయక్ విచారణ నిర్వహిస్తున్నారు . నిందితుడు గ‌ణేష్ వెంక‌ట‌గిరి మండాల‌నికి చెందిన వాడిగా గుర్తించి ఆ మేర‌కు పోలీసులు ఆత‌డి కోసం గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement