Friday, April 26, 2024

జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు.

చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జూన్ 15న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు… విచారణాధికారికి సహకరించాలని ఆదేశించింది. కేసు అంశంపై మీడియాలో మాట్లాడవద్దని తెలిపింది. జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement