Monday, May 6, 2024

బియ్యం సరే… కందిపప్పు, పంచదార మాటేంటి?

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలో ఉండవల్లి గ్రామంలో ప్రజలు రేషన్ అందని పరిస్థితి నెలకొంది. గత 5 నెలలుగా కందిపొప్పు, పంచదార అండటం లేదని ఉండవల్లి గ్రామస్థులు వాపోతున్నారు. ఉండవల్లిలోని డిపో షాప్ నంబర్:3 సస్పెన్షన్ ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.

దాదాపు రెండు వేల మందికి గత 5 నెలలుగా కంది పప్పు, పంచదార అందకపోవడం.. ఇన్ని నెలలుగా అధికారులు సమస్య కు ప్రత్యామ్నాయం చూపకపోవడం శోచనీయం. మాకెందుకు కందిపప్పు, పంచదార ఇవ్వడం లేదని రైతు కూలీలు, వాచ్మెన్ లు, పేదలు అధికారులను నిలదీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement