Monday, April 29, 2024

భవాని దీక్షలు విజయవంతంగా పూర్తి చేసాం… ఇంద్రకీలాద్రి ఈఓ భ్రమరాంబ

భ‌వాని దీక్ష‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేస్తామ‌ని ఇంద్ర‌కీలాద్రి ఈఓ భ్ర‌మ‌రాంబ తెలిపారు. ఆమె మాట్లాడుతూ… ఇంద్రకీలాద్రి ఆదాయం పెరిగిందన్నారు. ఐదురోజులకు 7 కోట్ల 50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఆరు లక్షలు ఖర్చు అయిందన్నారు. 5 లక్షల 40 వేల భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. 15 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయన్నారు. వచ్చే ఏడాది దసరా, దీక్షలకు పర్మినెంట్ హోమ గుండాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వచ్చే ఉత్సవాలకు ముందస్తుగా కొన్ని పనులు పూర్తి చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement