Friday, May 17, 2024

ఆగివున్న లారీని ఢీ కొట్టిన ఆటో, ఒక‌రు మృతి

ఉయ్యూరు: ఆగివున్న లారీని ఢీ కొని ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు వద్ద విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం విజయవాడ గుణధలకు చెందిన యోగయ్య ప్రతిరోజు పాల సేకరణకు ఆటో త‌నే న‌డుపుకుంటూ ఉయ్యూరు వస్తుంటాడు. బుధవారం 5 గంటలకు వస్తున్న క్రమంలో ఆకునూరు వద్ద ఫ్లై ఓవర్ పై ఒక లారీ పార్కింగ్ చేసి ఉంది. మంచు ప‌డుతుండ‌టంతో లారీ కనిపించకలేదు… అకస్మాత్తుగా వెనుక నుండి డీ కొట్టాడు. ధీంతో ఆటో తోలుతున్న యోగయ్య కు తీవ్ర గాయాలు అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబ స‌భ్యుల పిర్యాదు మేరకు అనుమతి లేకుండా లారీ ని జాతీయ రహదారిపై నిలిపిన డ్రైవర్ షేక్ నాగుల్ మీరా పై ఉయ్యూరు రూరల్ ఎస్సై జి.రమేష్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement