Monday, October 21, 2024

AP | తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు…

ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు… బుధవారం రాత్రి తిరుమలలోని గాయత్రీ నిలయం విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ(ఆరోగ్య, విద్యాశాఖ) జేఈవో గౌతమి తదితర అధికారులు పాల్గొన్నారు

రేపు శ్రీవారి దర్శనం

గురువారం ఉదయం 8 గంటలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లి తన ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement