Thursday, May 2, 2024

చంద్రగ్రహణం కారణంగా 8న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 8న చంద్రగ్రహణం కారణంగా 12 గంటలపాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. బ్రేక్‌ దర్శనం, శ్రీవాణిట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం కారణంగా నవంబర్‌ 8న తిరుపతిలో జారీచేసే ఎస్‌ఎస్‌డి టోకెన్లు రద్దు చేశారు. గ్రహణం సమయం ముగిసిన తరువాత వైకుంఠం – 2 నుంచి మాత్రమే భ క్తులను అనుమతిస్తారు. నవంబర్‌ 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం పోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్సు, ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి అసౌకర్యానికి గురికాకుండా తమ తిరుమలయాత్రను తదనుగుణంగా రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement