Wednesday, May 1, 2024

SKLM: వైసీపీ నాయకులను అడ్డుకున్న అగన్వాడీలు

ఇచ్ఛాపురం : తమ సమ్మెలో భాగంగా అంగన్వాడీలు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. స్థానిక బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆ సమయంలో అటువైపు వచ్చిన పీఏసీఎస్ అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో తమ డిమాండ్లను నరేంద్ర కు వివరించారు.

తమ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అలాంటి ఆదేశాలు జారీ కాలేదని నరేంద్ర సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. అలాంటప్పడు చర్యలు తీసుకొని అధికారులను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. మీకు న్యాయం చేస్తారంటూ నరేంద్ర ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement