Sunday, April 28, 2024

Srikakulam – ఏపీలో ఒడిశా ఓట్లు…మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ

శ్రీకాకుళం, (ప్రభ న్యూస్): ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు పాతపట్నం నియోజక వర్గ ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ అరపించారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కొత్తూరు మండలం బూత్ నెంబర్ 202లో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు.

202 బూత్ లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినది కాదని, ఇతర రాష్ట్రంలో ఉన్న వారిని చేర్చారని చెప్పారు. గతంలో జిల్లాకు స్పెషల్ ఎలక్ట్రోరల్ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన శ్యామలరావును కలసి ఫిర్యాదు చేశానన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ తో సహా కింది స్థాయి అధికారులు అందరికీ దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పాత ఓటర్లను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించ పోవడంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని కలమట వెంకటరమణ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement