Saturday, May 4, 2024

Spl Story – కృష్ణా న‌దిపై మూడు మినీ బ్యారేజ్ నిర్మాణాల‌కు మోక్షం ఎప్పుడు…….

కృష్ణా,ప్రభన్యూస్‌బ్యూరో: ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణానదిపై కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించ తలపెట్టిన రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. ఈ బ్యారేజీల నిర్మాణానికి నిధుల మంజూరు కోసం సంబంధించిన ఫైలు గత ఏడాదిగా ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. కృష్ణానదికి వరదలొస్తే వందలాది టీ-ఎంసీల నీరు సముద్రంపాలవుతోంది. మరోవైపు సముద్రానికి పోటు- వచ్చిన ప్రతిసారీ సముద్రపు నీరు ముందుకు వస్తోంది. ఫలితంగా కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములు చౌడుబారిపోతున్నాయి. భూగర్భ జలాలు ఉప్పుమయం అవుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టు-కుని వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడంతో పాటు- భూగర్భ జలాలు ఉప్పునీటి కయ్యలు కాకుండా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన రెండు మినీ బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,862 కోట్లతో మూడేళ్ల ఏళ్ల క్రితం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం – గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురంల మధ్య కృష్ణా నదిపై 3 టీ-ఎంసిల నీటి నిల్వ సామర్ధ్యంతో రూ.1512 కోట్ల కోట్ల వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని తీర్మానించింది. అలాగే రెండవది మోపిదేవి మండలం బండికోళ్లలంక – బాపట్ల జిల్లా రేపల్లె మం డలం తూర్పుపాలెం నడుమ కృష్ణా నదిపై రూ. 1350 కోట్ల ఖర్చుతో 3 టీ-ఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. కృష్ణా నదిపై నిర్మించబోయే కొత్త బ్యారేజీలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్‌ దీనిని రూపొందించింది. ఈ రెండింటిలో ఒక దానికే ప్రస్తుతం పరిపాలన ఆమోదం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు- తెలుస్తోంది. నదికి శివారున నిర్మించే రెండో బ్యారేజీకి ఆమోదం తెలిపిన తర్వాత మిగిలిన బ్యారేజీ గురించి ఆలోచించాలని సర్కారు భావిస్తున్నట్టు- సమాచారం.

ఈ డీపీఆర్‌కు ప్రభుత్వం రూ.2.5 కోట్లను కేటా యించింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజీనీ, దీనికి దిగువన 60 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి వద్ద మరో బ్యారేజీనీ నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ బ్యారేజీల డిజైన్లకు జలవనరుల శాఖ ఆమోదించింది. దీంతో అటు- మోపిదేవి వద్ద, ఇటు- చోడవరం వద్ద పరిస్థితులు పూర్తిగా మారతాయని భావిస్తున్నారు. చోడవరం, మోపిదేవి వద్ద బ్యారేజీల్లో ఒక్కో దాంట్లో 4.5 టీ-ఎంసీ నీరు నిల్వ ఉండేలా నిర్మిం చాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో చుక్క నీరు ఉండట్లేదు. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నిండుకుండలా కనిపిస్తుంది. చోడవరం, శ్రీకాకుళం వద్ద నిర్మిస్తే మూడు బ్యారేజీలు అవుతాయి.

- Advertisement -

కొత్తగా మినీ బ్యారేజీలు అందుబాటు-లోకి వస్తే మొత్తం 11.17 టీ-ఎంసీల నీరు నిల్వ ఉంటు-ంది. ప్రభుత్వం రెండు మినీ బ్యారేజీలకు ఒకేసారి ఆమోదం తెలపడంతో నిర్మాణం ఒకేసారి ప్రారంభమవుతుందని భావించారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ముందు ఒక బ్యారేజీకి ఆమోదం తెలిపే యోచనలో ఉన్నట్టు- సమాచారం. మినీ బ్యారేజీల నిర్మాణానికి అవసరమైన నిధులు సంబం ధించి ఫైలు ఆర్థిక శాఖ వద్ద గత ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నట్లు- సమాచారం. ఒకేసా రి రెండు మినీ బ్యారేజీల, లేక ఒక బ్యారేజీని నిర్మించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నిధులు సమీకరణ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement