Sunday, April 28, 2024

Spl Story – గిరిజన భూ వివాదాల పరిష్కారంపై జ‌గ‌న్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

అమరావతి: ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గిరిజన సంశేమానికి సీఎం జగన్‌ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలతో పాటు-గా డీకేటీ- పట్టాలను కూడా గిరిజనులకు అందించడం జరిగింది. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ- పట్టాలుగా ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలోనే గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్‌ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్‌టీ-ఆర్‌) ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్‌టీ-ఆర్‌ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు- ఇటీ-వల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్‌టీ-ఆర్‌ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్‌ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు- ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటు-ంది. ఎల్‌టీ-ఆర్‌ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీ-డీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటు-ంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్‌టీ-ఆర్‌ కేసులు, హక్కులపై ఐటీ-డీఏల పరిధిలో వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్‌ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్‌-3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్‌ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీ-డీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్‌టీ-ఆర్‌ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ- తహసిల్దార్‌ (డీటీ-) గుర్తించి నోటీ-సులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీ-డీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్‌వీఎన్‌పేట, కేఆర్‌పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్‌ డిప్యూటీ- కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటు-ంది. 1976 నుండి ఈ ఏడాది జూన్‌ వరకు 29,810 ఎల్‌టీ-ఆర్‌ వివాదాలు (1,47,554 ఎకరాలు) గుర్తించారు. 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాధీనం చేశారు. 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి న్యాయ స్థానాలలో పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement