Sunday, April 28, 2024

ఆదిత్యా నగర్‌ పార్కుకు .. ఎస్పీ.బి పేరు..

నెల్లూరు (ప్రభ న్యూస్‌) : గాన గంధర్వుడు , నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ సినీ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ( ఎస్పీ) కి నెల్లూరు కార్పొరేషన్‌ ఘన నివాళి సమర్పించింది. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సూచనలతో ఆయనకు తగు గుర్తింపు కలిగే విధంగా చర్యలు తీసుకుంది. నగర వాసులకే కాకుండా జిల్లా వాసులకు కూడా కలకాలం గుర్తుండేలా నగరంలోని ఆదిత్యా నగర్‌ కార్పొరేషన్‌ పార్కుకు ఎస్పీ పేరు పెట్టాలని గురువారం జరిగిన కార్పొరేషన్‌ తొలి సర్వసభ్య సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లతో సహా అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

కార్పొరేషన్‌ పార్కుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టాలని ఆయనను గౌరవించుకోవడం మనకెంతో అవసరమని మంత్రి అనిల్‌ కార్పొరేటర్లకు సూచనలు ఇవ్వడంతో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆదిత్యా నగర్‌ కార్పొరేషన్‌ పార్కుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement