Friday, April 26, 2024

విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?: సోము వీర్రాజు లేఖ

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తుంటే మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులను ఆస్పత్రులపాలు చేస్తారా? అని ఫైర్ అయ్యారు. వెంటనే కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంట వండే వారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎం జగన్ ను కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు జగన్ కు ఆయన బహిరంగలేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement