Friday, May 3, 2024

అన్యమత నిర్మాణాలను ఆపండి: వాటిని కూల్చేస్తామన్న సోము

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనలో రోజురోజుకూ అన్యమత ప్రచారం పెరుగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అన్యమత ప్రచారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో హిందువులకు పవిత్రమైన తిరుమలనాథ స్వామి క్షేత్రం వద్ద గొడ్రాలికొండ మీద ఇటీవలికాలంలో అన్యమత చిహ్నాలు వెలిశాయి అన్నారు. చర్చి నిర్మాణం జరుగుతోందని మండిపడ్డారు.ఇలా అక్రమంగా హిందువుల మనోభావాలుదెబ్బతినేలా నిర్మిస్తున్న అన్యమత నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే తామే వాటిని కూల్చివేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement