Monday, May 6, 2024

AP: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి పొలిటికల్ హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆయన దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఆయన్ను దీక్షా శిబిరం నుంచి తరలించారు. ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. సోమిరెడ్డి దీక్ష భగ్నం కోసం పోలీసులు రావడంతో ఆయన అభిమానులు అడ్డుకున్నారు.

పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. 

ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు. కాగా పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో మూడు రోజులక్రితం సత్యాగ్రహ దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement