Thursday, May 2, 2024

విజయనగరంలో విషాదం.. విద్యార్థులను కాటేసిన పాము

విజయనగరం జిల్లా కురపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వేసింది. పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో విద్యార్థులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన విద్యార్థిని మంతిని రంజిత్‌గా గుర్తించారు. ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌ ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు పాము కాటుకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. జేసీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆస్పత్రి వద్దకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement