Friday, May 3, 2024

డైకిన్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం.. డిప్లమో విద్యార్థులకు 500 ఉద్యోగాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణభివృద్ధి సంస్థ డైకిన్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. 75 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎండి సత్యనారాయణ సమక్షంలో డైకిన్‌ సంస్థ ప్రతినిధులు గురువారం అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 2020 మరియు 21 డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో 500 ఉద్యోగాలు కల్పిస్తామని తెలియజేశారు.

వారికి తమ సంస్థలో శిక్షణ ఇచ్చి సంవత్సరానికి వార్షిక వేతనం 1,99,000.ఇస్తామని తెలిపారు. డిప్లమా పూర్తయిన విద్యార్థులకు జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఎండీ సత్యనారాయణ చెప్పారు. అందుకు అవసరమైన కార్యచరణ రూపొందించామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement