Sunday, April 28, 2024

అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యుడిగా గంట్ల శ్రీను

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో సభ్యులు తమ పదవీ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న దేవస్థానం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు  చేపట్టామని, త్వరలోనే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. త్వరలోనే ప్రహ్లాదకల్యాణ మండపం స్వాధీనం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని శ్రీను బాబు కోరారు. సింహాచలం గ్రామస్తుడుగా ధర్మకర్తల మండలి సభ్యుడిగా  పదవి స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేవుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులకు శ్రీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement