Monday, April 29, 2024

Breaking: చంద్రబాబుకు షాక్… మూడు ముంద‌స్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిల్‌ పిటిషన్లపై తీర్పులు వెలువడ్డాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement