Monday, April 29, 2024

Tour Schedule – ఏపీలో షర్మిల పర్యటన..20న ఇడుపలపాయకు పయనం ….


ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటన కొనసాగనుంది. ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని.. సాయంత్రం వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్​గా బాధ్యతలను స్వీకరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement