Sunday, April 28, 2024

AP | సీఎం జగన్‌పై దాడి.. స్పందించిన షర్మిల

తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌పై దాడి జరిగి ఎడమ కన్నుపై గాయం కావడం బాధాకరమని, దురదృష్టకరమన్నారు. ప్రమాదవశాత్తు జరిగినట్లు అనుకుంటున్నాం అని తెలిపారు.

కానీ ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేసి ఉంటే, ఇలాంటి ఘటనను అందరూ కచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రతి ప్రజాస్వామిక వాది హింసను ఖండించాలని.. అన్న జగన్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement