Tuesday, April 30, 2024

AP | జగన్‌పై దాడి.. స్పంధించిన కేటీఆర్, టేక్ కేర్ అన్నా అంటూ పోస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని వైసీపీ నేతలు, తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు, హింసకు తావులేదని.. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పోస్ట్‌లో కోరారు.

విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తుండగా.. సింగ్‌నగర్‌ వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి జగన్ పైకి రాయి విసిరారు. దీంతో జగన్ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. రాయి దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement