Tuesday, April 30, 2024

AP | ఆదరణ ఓర్వలేకనే జగన్ పై దాడి : పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి వస్తున్న ఆదరణ చూడలేక ఆయనపై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. గాయానికి రెండు కుట్లు పడే అవకాశముంది. ఓ వైపు కళ్లు బైర్లు కమ్మినా మళ్లీ యాత్రను జగన్ కొనసాగిస్తున్నారు. శత్రువులు ఏం చేసినా కూడా సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు పేర్ని నాని.

విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి జ‌రిగిన స‌మ‌యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం కలకలం రేపుతోంది. ఆ మార్గంలో పలుమార్లు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన చోట ఓ వైపు పాఠశాల, మరోవైపు భవనాలు ఉన్నాయి. పాఠశాల భవనం వైపు నుంచి రాయి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement