Saturday, May 4, 2024

లాఠీఛార్జిని ఖండించిన విద్యార్థి సంఘాలు

అనంతపూరంలో విద్యార్థుల పై దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒంగోలులోని  సెయింట్ జేవియర్స్ స్కూల్ వద్ద SFI, PDSU ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ అనంతపురంలో SSBN కాలేజీ వద్ద ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ చేయొద్దని శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులు పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణం అని అన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ తో కలిసి విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు ఇదే తీరుతో వ్యవహారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే దేనికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement