Thursday, May 2, 2024

AP: గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

శ్రీ సత్య సాయి బ్యూరో, నవంబర్ 3 (ప్రభన్యూస్) : కదిరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ బాబు (65) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడేవారు. కాగా అరవింద్ బాబు ఉమ్మడి అనంతపురం జిల్లా ఉండగా టీడీపీ జిల్లా కార్యదర్శిగా, సింగల్ విండో అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు.

అరవింద బాబు మృతి పట్ల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీ కే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఇంకా కదిరి మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకట ప్రసాద్, అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి, వైసీపీ నాయకులు పీఎస్ మక్బూల్ అహ్మద్, తదితరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement