Sunday, April 28, 2024

పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాలి.. హైకోర్టు ఆదేశం

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భద్రతకు సంబంధించి పయ్యావుల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరుగగా.. కేశవ్‌కు భద్రత కల్పించాల్సిన అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ఉరవకొండలో పరిస్థితులు ఏంటో తెలుసని.. అటువంటప్పుడు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నిస్తూ కేశవ్‌‌కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement