Monday, May 6, 2024

AP : కాల్వ‌లోకి దూసుకెళ్లిన‌ స్కూల్ బ‌స్సు.. త‌ప్పిన ప్ర‌మాదం

కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి సమీపంలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం స్కూల్ బస్సు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకువెళ్లింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న అయిదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

పంట కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో ముప్పు తప్పింది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ తమ చిన్నారులు క్షేమంగా బయటపడటంతో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement