Monday, May 6, 2024

Sattenapalli – కుటుంబ క‌ల‌హాల‌తో త‌ల్లి, చెల్లి హ‌తం…

స‌త్తెన‌ప‌ల్లి – ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిపాళ్లలో నివాసముంటున్న రమీమున్‌( 65), ఆమె కూతురు మౌలాబీ (36)ని ఖాసీం రాడుతో కొట్టి చంపాడు. అనంత‌రం అత‌డు అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు.. వరుసకు కుమారుడయ్యే ఖాసీం ఈ దారుణానికి ఒడిగట్టాడని సత్తెనపల్లి పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా ఖాసీం వారిపై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. ప‌రారీలోని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement