Monday, May 6, 2024

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. కేబినెట్ విస్తరణపై సజ్జల కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందరస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారన్నారు. అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయాలనుకునే వారే ముందస్తుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. 

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై కూడా సజ్జల క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన నెండూ మాకు కీలకమేనని సజ్జల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement