Monday, April 29, 2024

Sajjala – ముందస్తు ముచ్చట పవన్, చంద్రబాబులది.. మేం ఐదేళ్లు పాలిస్తాం

తాడేపల్లి : ఏపీలో ముందస్తు ఎన్నిక ప్రసక్తే లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు ఎన్నికలంటూ కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాతీర్పు ప్రకారం చివరిరోజు వరకూ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు సజ్జల. చంద్రబాబు, పవన్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని…తమకు మాత్రం పూర్తి సమయం అవసరమని తెలిపారు. ప్రజా ఆశీర్వాచనాలతోనే ఎన్నికలకు రెడీ అవుతామని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీనిచ్చారు..

కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో సజ్జల స్పందిస్తూ, ఆమె పార్టీ, ఆమె ఇష్టం… ఏ పార్టీ లోకి వెళతారో , ఎక్కడ పోటీ చేస్తారో షర్మిల ఇష్టం… ఆ పార్టీ విషయాల తో మాకేమీ సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement