Saturday, April 27, 2024

సాగర నగరం కనెక్టివిటీ హబ్ గా ఉంటుంది .. త‌మ్మినేని సీతారాం

సాగర నగరం రాజ‌ధానికి అనుకూలంగా.. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విశాఖ రాజ‌ధానిపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అటు పారిశ్రామికవేత్తలు కూడా విశాఖపట్నం ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయం అద్భుతంగా ఉందని, ప్రజలు స్వాగతిస్తున్నారని వివరించారు. తాను కూడా విశాఖపట్నం వచ్చేస్తున్నానని స్వయంగా జగనే చెప్పారని, విశాఖ ఇండస్ట్రియల్ కారిడారుగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన చేస్తే ఆ ప్రాంతమే రాజధాని అవుతుందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement