Sunday, May 5, 2024

ఓర్వకల్లులో రోడ్డు ప్రమాదం – ఏడాది పాప మృతి

ఓర్వకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహనం కారు ఢీకొని ఏడాది పాప మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలకు వెళితే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న విష్ణువర్ధన్, స్వర్ణలత తమ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తుండగా సోమాజిపల్లె దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గర ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో విష్ణువర్ధన్, స్వర్ణలతలు కూడా గాయపడ్డారు. వీరితోపాటు మరో ఇరువురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement