Friday, April 26, 2024

చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి

చీమకుర్తి ( ప్రభ న్యూస్ ) : ఏపీలోని ప్ర‌కాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద యాక్సిడెంట్ జ‌రిగింది. మధుకాన్ గ్రానైట్ క్వారీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శంకర్ (14)అనే యువకుడు మృతి చెందాడు. శంకర్ మోటార్ బైకు పై చీమకుర్తి వైపు వెళుతుండగా లారీ తగిలి అక్కడే మృతి చెందాడు. కనిగిరి చెందిన వీరి తల్లి తండ్రులు బుదవాడ వద్ద గల గ్రానైట్ ఫ్యాక్టరీ లో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు.

- Advertisement -

మృతుడు శంక‌ర్ ఉప్పలపాడులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చ‌దువుతున్నాడు. త‌మ కుమారుడి మృతితో తల్లి తండ్రులు బోరున విలపించడం అంద‌రినీ కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement