Friday, May 17, 2024

బదిలీలలో సడలింపు ఉత్తర్వులు… ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు

అమరావతి, ఆంధ్రప్రభ: జీవో 122 ద్వారా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని సడలింపు ఉత్తర్వులు ఇవ్వడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు తెలిపారు. ఒక ప్రకటనలో ప్రధానంగా ఉద్యోగులందరూ కోరుకున్న ట్రాన్స్ఫర్‌లనుపాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా ఈ సారికి బదిలీలు జరిపేలా సవరణ చేయడం హర్షణీయమన్నారు. అలాగే జిల్లాల విభజనలో కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్‌లో వెళ్ళిన వారికి కూడా వెసులుబాటు ఇవ్వడం పట్ల ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. బదిలీల ప్రక్రియకు కాలపరిమితిని ఈ నెల 30 వరకు పొడిగించడం ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ల రాష్ట్ర, జిల్లా, డివిజన్‌/ తాలూకా కమిటీలకు బదిలీలలో మూడు పర్యాయాలు లేక 9 సంవత్సరాల వరకు అవకాశం కలుగచేయడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా ఉద్యోగులు కోరుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులలో సవరణలకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సహకరించిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిలకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement