Tuesday, April 30, 2024

Breaking | పురివిప్పిన పాత కక్షలు.. కర్నూలులో వ్యక్తి దారుణ హత్య

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్పరి మండలం, బయలు పత్తికొండ గ్రామంలో ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) జరిగింది. సుంకలమ్మ దేవర కారుమంచి గ్రామానికి చెందిన బోయ హనుమంతు(54) తన భార్య సొంత గ్రామమైన పొట్లపాడులో నివాసం ఉంటున్నాడు. కాగా, తమ స్వగ్రామమైన బయలు పత్తికొండలో సుంకులమ్మ జాతరకు వచ్చారు.

అయితే.. ఇది గమనించిన అతని శత్రువులు బోయ హనుమంతుని కొండ రాళ్లతో కొట్టి చంపేశారు. ఇక మృతుడు హనుమంతు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement