Sunday, April 28, 2024

Big Breaking | తెలంగాణకు రెడ్​ అలర్ట్​.. హైదరాబాద్​లో పిడుగుల వాన!

రెండ్రోజులపాటు గెరువిచ్చిన వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీఢనం కారణంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో, ఏపీలో మరో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది.

ఇక.. హైదరాబాద్​లోని అత్తాపూర్​లో పిగుడులు పడ్డాయి. వాసుదేవనగర్​ అపార్ట్​మెంట్​ మధ్యలో పిడుగుపడింది. ఒ వ్యక్తి అపార్ట్​మెంట్​లోకి వెళ్తుండగానే అతని పక్కనే పిడుగుపడడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. అదృష్టవశాత్తు అతను పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడని ఇది చూసిన చాలామంది అంటున్నారు. దీంతో అత్తాపూర్​ చుట్టుపక్కల ఇండ్లలో ఒక్కసారిగా షార్ట్​ సర్క్యూట్​ అయ్యింది. చాలా ఇండ్లలో టీవీలు,  ఫ్రిడ్జ్​లు కాలిపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక.. హైదరాబాద్​కు ఆరెంజ్​ అలర్ట్​ని వాతావరణ శాఖ జారీ చేసింది.

కాగా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం స్కూల్​ టైమింగ్స్​లో మార్పులు చేసింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు హై స్కూల్​ సమయం ఉండనుంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు ప్రైమరీ స్కూల్స్​ ఉండనున్నాయి. హైదరాబాద్​ మినహా ఇతర అన్ని జిల్లాల్లో ఈ మార్పులు ఉంటాయని విద్యాశాఖ ప్రకంటిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement