Saturday, May 11, 2024

తిరుమ‌ల‌లో అన్న‌దాన సేవ‌లో పాల్గొన్న హీరోయిన్ రాశీ ఖ‌న్నా..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: జులై 1 వ తేది విడుదల కానున్న పక్కా కమర్షియల్‌ చిత్రం కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమని హీరోయిన్‌ రాశికన్నా తెలిపారు. బుధవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆమె నిర్మాత శ్రీనివాస్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంత‌రం అన్న‌దాన సేవ‌లో భ‌క్తుల‌కు అన్నం వ‌డ్డించారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడుతూ పక్కా కమర్షియల్‌ చిత్రం బాగా వచ్చిందని ప్రేక్షతులు థియోటర్లకు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్నారు. తెలుగులో మరికొన్ని చిత్రాలను చేస్తున్నానని చెప్పగా స్వామివారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని, ఇప్పటికే మా బ్యానర్‌లో హ్యాట్రిక్‌ హిట్లు సాధించామని పక్కా కమర్షియల్‌ విజయంతో నాలుగవ హిట్‌ను సాధించబోతున్నామని నిర్మాత తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement