Monday, May 6, 2024

కుప్పంలో బాలికపై అత్యాచారం కలచివేసింది: టీడీపీ అధినేత చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు. ఘటనపై స్థానిక పార్టీ నేతలతో మాట్లాడారు. అసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటన తనను ఎంతో బాధించిందని, పసి వాళ్లపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అత్యంత కఠిన శిక్షల ద్వారానే ఇలాంటి నేరాలను అదపుచెయ్యడం సాధ్యం అవుతుందని చంద్రబాబు అన్నారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement