Sunday, April 28, 2024

Rajahmundry – చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు. వెంటనే అలర్ట్‌ అయిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పట్టుకుని నిల్చోబెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకి దించేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement