Monday, April 29, 2024

పోలీసుల అదుపులో రైల్వే దోపిడి నిందితులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ దోపిడి ఘటనలో నిందితులు నడికుడి జిఆర్పీ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గత సోమవారం రాత్రి చెన్నై వెళ్లేందుకు ముగ్గురు వ్యక్తులు ప్లాట్ ఫారంపై వేచి ఉండగా కారులో వచ్చిన ఆరుగురు దుండగులు వారిని ఏమార్చి వారి వద్ద ఉన్న రూ.89 లక్షల నగదు ఉన్న బ్యాగ్ లను తీసుకుని పరారైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. దీంతో అప్రమత్తమైన రైల్వే జిఆర్పీ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దోపిడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అదుపులోకి ‌తీసుకొని దోపిడి సొమ్ము రూ. 89 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement