Friday, May 3, 2024

ఆర్మీ ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్న రఘురామరాజు

బెయిలు మంజూరు కావడంతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు విడుదల కానున్నారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసేందుకు సమయం పట్టడంతో రాత్రి ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. మరికాసేపట్లో ఆయన విడుదల కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement