Monday, April 29, 2024

రేపు వృద్దులకు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల..

తిరుమల, ప్రభన్యూస్‌ : వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాదులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారి చేస్తారు. ఈ టోకెన్లు బుక్‌ చేసుకున్న వారిని మద్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్దులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement