Monday, April 29, 2024

Pulivendula – బావిలోకి దూసుకెళ్లిన వాహనం … ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

కడప, ఫిబ్రవరి 1: (ప్రభ న్యూస్): వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం బావిలోకి దూసుకెల్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరిని మహారాష్ట్ర వాసులుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ కిల్వాని, ప్రకాష్ బూర టాగూర్ అను ఇరువురు అరటికాయల వ్యాపారులు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పార్నపల్లె నుంచి పులివెందుల బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఉన్న లీలావతి వృద్ధాశ్రమం సమీపంలోనిరోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఇక మరో 15 నిమిషాల్లో పులివెందుల చేరాల్సి ఉంది. ఈ విషయము సదరు పులివెందులలో ఉంటున్న వ్యాపారులకు శర్వాణిద్వారా కిల్వాని, ఠాగూర్ లు తెలియజేశారు. రాత్రి కావస్తున్న ఇరువురు వ్యాపారులు పులివెందుల చేరుకోలేదు.10 నిమిషాల్లో చేరుకుంటామని శర్వాణి ద్వారా తెలియజేసిన వారు ఒకసారి వారికి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పులివెందుల వ్యాపారులు పరిస్థితిపై గమనించారు.

ఇప్పట్ల సమీపంలో గోడను ఢీ కొట్టిన ప్రదేశాన్ని వారు చూశారు. వాహనం అధువు తప్పి ఉంటుందా అన్న కోణంలో అక్కడే ఉన్న బావిలోకి తొంగి చూడగా తేలాడుతున్న వాహనం కనిపించింది. వెంటనే ఈ సమాచారాన్ని లింగాల స్టేషన్కు తెలియజేశారు. దీంతో లింగాల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మునిగి ఉన్న కారును గమనించారు. ఆ తర్వాత యంత్రాల సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అప్పటికే మహారాష్ట్ర వాసులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement