Monday, April 29, 2024

Bus Fire: ప్రైవేట్ బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

ప్రకాశం జిల్లాలో బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో నుంచి వస్తున్న మంటలను గమనించిన ప్రయాణికులు.. వెంటనే బస్సు నుంచి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ప్రయాణికుల సామగ్రి మంటల్లో దగ్ధమైంది. బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు వాడులో పడిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలింది. అయితే, తాజా ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement