Saturday, May 18, 2024

శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి కొడాలి

గుడివాడ: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) కోరారు. బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ సీఐగా జ‌య‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గౌర‌వ పూర్వ‌కంగా ఆయ‌న మంత్రి నానిని క‌లిశారు. పుష్ప గుచ్ఛం అందించారు. ఈ సందర్బంగా మంత్రి నాని మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి సమ న్యాయం అందించేలా పోలీసులు వ్యవహరించేలా చూడాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆకాంక్షాలకు అనుగుణంగా నడచు కోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement