Friday, May 3, 2024

ఇంగ్లీష్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన యంఈఓ

యర్రగొండపాలెం: మండల పరిధిలోని యంపియుపి పాఠశాల వై. కొత్తపల్లిలో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఇంగ్లీష్‌ ల్యాబ్‌ను మండల విద్యాశాఖాధికారి పి.ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సియంసి కమిటీ చైర్మన్‌ ఎ.నరసింహరెడ్డి పాఠశాలకు వంటసామాగ్రిని యంఈఓ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు యం.నాగేశ్వరరావునాయక్‌కు అందజేశారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కానుకగా ప్లేట్లను గ్రామ పెద్దలతో కలిసి మండల విద్యాశాఖాధికారి పంపిణీ చేశారు. అనంతరం నాడునేడు పనులను పరిశీలించి గ్రామ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సిహెచ్‌ ఓబులరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్‌ వి.గురవారెడ్డి, పలువురు గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement