Saturday, May 18, 2024

మనచేతుల్లో-మన భద్రత కార్యక్రమానికి యుటిఎఫ్‌ చేయూత..

కందుకూరు : మనచేతుల్లో – మనభద్రత కార్యక్రమంలో భాగంగా కందుకూరు డివిజన్‌ యూటిఎఫ్‌ కమిటీ కందుకూరు టౌన్‌ పోలీసు స్టేషన్‌కు రెండు సిసి కెమెరాలను సమకూర్చాలని సంకల్పించింది. ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి పిలుపుకు స్పందించిన పలువురితోపాటు కందుకూరు డివిజన్‌ యుటిఎఫ్‌ శాఖ సానుకూలంగా స్పందించింది. అందుకోసం 40 వేల నగదును ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి సమక్షంలో సిఐ విజయ్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు మాధవరావు, కిలారి వెంకటేశ్వర్లు, జి.సతీష్‌, టి.కృష్ణకుమార్‌, నలమోతు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజోపయోగ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు యుటిఎఫ్‌ నేతలను ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement