Thursday, April 25, 2024

రోడ్డుప్రమాదంలో చిన్నారి మృతి

ఓ రోడ్డుప్రమాదంలో చిన్నారి మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీమకుర్తి బైపాస్ లో జరిగిన ఈ సంఘటన అందరినీ కలచివేస్తోంది. నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి ఈ ప్రమాదంలో తనువు చాలించింది. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న చిన్నారిని తండ్రి తన బైక్ పై పాఠశాలకు తీసుకు వస్తుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న ఎస్కర్ట్ క్రేన్ ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే తనువు చాలించింది. తండ్రికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement