Friday, March 29, 2024

ఒక్కో సినిమాకి రూ. 4కోట్లు డిమాండ్ చేస్తోన్న – థ‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ మొన్న‌టి వ‌ర‌కు మూడుకోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకునేవారు.కాగా తన తదుపరి సినిమాలకు భారీగా పారితోషకం పెంచారు అని సమాచారం. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుస హిట్టు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా భారీగా రెమ్యునరేషన్ కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన మ్యూజిక్ అందించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే.. ఆయన పారితోషకం పెంచడానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ సినిమానందుకోవడంతో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మరొకవైపు తమిళ్ ప్రాజెక్టు లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. అలాగే బోయపాటి, రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి కూడా ఈయనే సంగీతం వహిస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement